తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టి. నాగయ్య (T. Nagayya) అర్ధరాత్రి 2 గంటలకు గుండెపోటుతో తన స్వగ్రామమైన బెల్లంపల్లి లో మృతి చెందారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నాగయ్య కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో సీనియర్ నాయకులుగా, మేధావిగా గుర్తింపు పొందారు. టి. నాగయ్య మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నాగయ్య లాంటి విద్యావంతులు, మేధావి, ఉద్యమ కారుడి అకాల మరణం కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి తన జీవితకాలం పార్టీ విస్తృతం చేసేందుకు కృషి చేసిన నాయకులు నాగయ్య అని ఆయన అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య..ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో అమెరికాకు వెళ్తున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత. ఐతే అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్లు కొందరైతే..మరికొంత మంది సరైన ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు..ఈ నేపథ్యంలోనే…
- కలగానే మిగిలిన సొంతింటి కల..పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో పేదల సొంతింటి కల ఇంకా అటకెక్కే ఉంది. గత ప్రభుత్వ హయాంలో పార్వతీపురం మండలం అడ్డాపుశిల, సాలూరు మున్సిపాలిటీ పరిధిలో భారీ ఎత్తున టిడ్కో ఇళ్లను నిర్మించారు. మొత్తం 1,983 మంది లబ్ధిదారులకు…
- భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర..కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై చమురు మార్కెటింగ్ సంస్థలు ఏకంగా రూ.993 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఈ ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే, గృహ వినియోగదారులకు ఊరట…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 61763