తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టి. నాగయ్య (T. Nagayya) అర్ధరాత్రి 2 గంటలకు గుండెపోటుతో తన స్వగ్రామమైన బెల్లంపల్లి లో మృతి చెందారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నాగయ్య కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో సీనియర్ నాయకులుగా, మేధావిగా గుర్తింపు పొందారు. టి. నాగయ్య మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నాగయ్య లాంటి విద్యావంతులు, మేధావి, ఉద్యమ కారుడి అకాల మరణం కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి తన జీవితకాలం పార్టీ విస్తృతం చేసేందుకు కృషి చేసిన నాయకులు నాగయ్య అని ఆయన అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట టెంపుల్లో స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా 108 కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాటిలోని పవిత్ర జలాలకు పూజలు చేశారు.పంచామృతం,…
- కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..కడప జిల్లా పులివెందులలో రాజకీయ హీట్ పెరుగుతోంది.ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ తాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయని టీడీపీ ఇంచార్జి బి.టెక్ రవి విమర్శించారు.ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పులివెందుల పట్టణంలోని క్రిస్టియన్ వీధిలో పెన్షన్లు ఆయన…
- అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య..ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో అమెరికాకు వెళ్తున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత. ఐతే అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్లు కొందరైతే..మరికొంత మంది సరైన ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు..ఈ నేపథ్యంలోనే…




Total views : 61774