104
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట టెంపుల్లో స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా 108 కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాటిలోని పవిత్ర జలాలకు పూజలు చేశారు.పంచామృతం, సుగంధ ద్రవ్యాలతో పంచసూక్త పఠనాలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అభిషేకం వైభవంగా జరిగింది.ఇక కొండక్రింద వైకుంఠ ద్వారం వద్ద నూతనంగా ప్రతిష్టించిన స్వామివారి పాదాల పూజలను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రారంభించారు.





Total views : 81457