60
చదువుతోనే సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్లో తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఉన్న ఉచిత విద్యా సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆర్ కృష్ణయ్య కోరారు. రాష్ట్రంలో గురుకులాలు అద్భుతంగా నడుస్తున్నాయని, మూడో తరగతి నుంచి పీజీ వరకు ఉచితంగా చదివే అవకాశం ఉందన్నారు. సుమారు 8 లక్షల మంది విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి, బోధన సదుపాయాలు అందుతున్నాయని తెలిపారు.






Total views : 146665