వికారాబాద్ జిల్లా తాండూరులో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ (Konda Visveswar Reddy) కి మద్దతుగా గోషామాల్ ఎమ్మెల్యే ప్రచారం చేశారు. చేవెళ్ల పార్లమెంటు కొండ విశ్వేశ్వర్ ని భారీ మెజార్టీతో గెలిపిద్దామని ప్రజలకు కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను మోసంచేశారని తీవ్రస్థాయిలో రాజాసింగ్ మండిపడ్డారు. ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డికి మోడీ ఆశీర్వాదం ఉందన్నారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే బిజెపికి ఓటు వేసి హిందువుల బలం చూపాలన్నారు. మోడీ భారతదేశం కోసం ఎంతో కష్టపడుతున్నారని మరోసారి మోడీ పీఎం కావడం ఖాయమన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కాంగ్రెస్ పార్టీ వస్తే లవ్ జిహాద్ పెరుగుతుందని ఇప్పటికైనా అందరూ ఆలోచించి కొండ విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ ఆశీర్వాదంతో తాండూరు నియోజకవర్గ సమస్యలపై పోరాడి అభివృద్ధి చేసుకుందామన్నారు. యువకులు బిజెపికి ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CVR NEWS LIVEAdvertisements
- కడప లో వైసీపీకి షాక్టీడీపీ కి క్యూ కడుతున్న వైసీపీ శ్రేణులు… పులివెందులలో మరోమారు వైసీపీకి షాక్ ఇచ్చిన క్యాడర్.. వేంపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు… చక్రాయపేట,వేంపల్లి మండలాల్లో బలం ఉన్న వైసీపీ నేత దేవర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు…
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…