వికారాబాద్ జిల్లా తాండూరులో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ (Konda Visveswar Reddy) కి మద్దతుగా గోషామాల్ ఎమ్మెల్యే ప్రచారం చేశారు. చేవెళ్ల పార్లమెంటు కొండ విశ్వేశ్వర్ ని భారీ మెజార్టీతో గెలిపిద్దామని ప్రజలకు కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను మోసంచేశారని తీవ్రస్థాయిలో రాజాసింగ్ మండిపడ్డారు. ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డికి మోడీ ఆశీర్వాదం ఉందన్నారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే బిజెపికి ఓటు వేసి హిందువుల బలం చూపాలన్నారు. మోడీ భారతదేశం కోసం ఎంతో కష్టపడుతున్నారని మరోసారి మోడీ పీఎం కావడం ఖాయమన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కాంగ్రెస్ పార్టీ వస్తే లవ్ జిహాద్ పెరుగుతుందని ఇప్పటికైనా అందరూ ఆలోచించి కొండ విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ ఆశీర్వాదంతో తాండూరు నియోజకవర్గ సమస్యలపై పోరాడి అభివృద్ధి చేసుకుందామన్నారు. యువకులు బిజెపికి ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమెరికా -ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు ..ఇరాన్, అమెరికా మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరస్పర దాడులతో రెండు దేశాల మధ్య మళ్లీ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తమ ఆయిల్ ట్యాంకర్ పై దాడికి ప్రతిగా హర్మూజ్ జలసంధిలోని 3 అమెరికా నౌకలపై ఇరాన్ దాడి చేసింది.…
- పురాతన శివాలయం కూల్చివేతపై వివాదం..వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో కాకతీయుల నాటి పురాతన శివాలయం కూల్చివేత వివాదంగా మారింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో 700 నుంచి 800 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని కూల్చివేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అశోక్ నగర్…
- ఏపీ సచివాలయంలో కొనసాగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్..ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజు కొనసాగుతోంది. ఫైళ్ల క్లియరెన్స్, అవేర్, డేటా లేక్ వంటి కీలక అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల…





Total views : 69879