వికారాబాద్ జిల్లా తాండూరులో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ (Konda Visveswar Reddy) కి మద్దతుగా గోషామాల్ ఎమ్మెల్యే ప్రచారం చేశారు. చేవెళ్ల పార్లమెంటు కొండ విశ్వేశ్వర్ ని భారీ మెజార్టీతో గెలిపిద్దామని ప్రజలకు కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను మోసంచేశారని తీవ్రస్థాయిలో రాజాసింగ్ మండిపడ్డారు. ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డికి మోడీ ఆశీర్వాదం ఉందన్నారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే బిజెపికి ఓటు వేసి హిందువుల బలం చూపాలన్నారు. మోడీ భారతదేశం కోసం ఎంతో కష్టపడుతున్నారని మరోసారి మోడీ పీఎం కావడం ఖాయమన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కాంగ్రెస్ పార్టీ వస్తే లవ్ జిహాద్ పెరుగుతుందని ఇప్పటికైనా అందరూ ఆలోచించి కొండ విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ ఆశీర్వాదంతో తాండూరు నియోజకవర్గ సమస్యలపై పోరాడి అభివృద్ధి చేసుకుందామన్నారు. యువకులు బిజెపికి ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
- ఇరాన్తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.అమెరికా, ఇరాన్ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హర్మూజ్ జలసంధిని తిరిగి…
- ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…





Total views : 140787