గుంటూరు నగరంలో అనధికార కట్టడాలపై నగరపాలక సంస్థ అధికారులు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అనధికార కట్టడాలు కట్టిన నేతలకు వెన్నులో వణుకు పుడుతోంది. అక్రమంగా నెలకు లక్షల్లో సంపాదిస్తున్న వారి నోట్లో మట్టి కొట్టినట్లు అయ్యింది. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఒక వైసిపి ముఖ్య నేత బినామీల పేర్లతో అక్రమ కట్టడాలకు తెర లేపారు. కూటమి ప్రభుత్వం రావడంతో నగరపాలక సంస్థ అధికారులు కట్టడాలు కూల్చివేయడం మొదలుపెట్టారు. హైడ్రా తరహాలో నగరపాలక సంస్థ అధికారులు అనధికార కట్టడాలను కూల్చి వేస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డులోని లక్ష్మీ సెలబ్రేషన్స్ బార్ అండ్ రెస్టారెంట్ యజమాని ఖలీల్ రెండు సంవత్సరాల క్రితం దాదాపు కోటి రూపాయలతో అక్రమ కట్టడం నిర్మించి అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత ఖలీల్ కు మేయర్ తో సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి అధికారులు
పేరుకు మాత్రం నామమాత్రపు నోటీసులు జారీ చేసి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఇప్పుడు ఆ అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు. నగర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న కమిషనర్ పులి శ్రీనివాసులను నగరవాసులు అభినందిస్తున్నారు. ఇలాంటి అనధికారిక కట్టడాలు ఇంకా ఎన్ని ఉన్నాయో వాటిపై కూడా అధికారులు దృష్టి సారించాలని నగర ప్రజలు కోరుతున్నారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కొత్తగూడెం మేయర్గా ఎన్నికైన CPI అభ్యర్థి గణేష్కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధికి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామని.. CPI MLA కూనమనేని సాంబశివరావు అన్నారు. మేయర్గా ఎన్నికైన గణేష్కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ఒప్పందంలో భాగంగా మొదటి రెండున్నరేళ్లు తాము మేయర్ పీఠంలో ఉండామని వెల్లడించారు. పేదల…
- శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలుశ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం లో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించిన లింగోద్భవ దర్శనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట్ సుధీర్ రెడ్డి దంపతులు, దేవస్థానం…
- పెద్దపల్లి జిల్లాలో కొలువుదీరనున్న కొత్త పాలకవర్గంపెద్దపల్లి జిల్లాలో కొత్త పాలకవర్గం నేడు కొలువుదీరనుంది. రామగుండం మేయర్, పెద్దపల్లి , మంథని మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అయితే పోటీ తీవ్రంగా నెలకొనడంతో సుల్తానాబాద్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను…
- మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆసక్తికర పరిణామాలుమున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు తామిచ్చిన డబ్బును తిరిగివ్వాలంటూ ఓటర్లను డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మేడ్చల్లో డబ్బులు తిరిగివ్వమని అడిగిన అభ్యర్థి భర్తపై తిరగబడ్డారు ఓటర్లు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని బండమాచారం19వ వార్డులో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి ఓటమి…
- ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావులఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల .ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల 32 వేల 205 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తమ దృష్టిలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి