గుంటూరు నగరంలో అనధికార కట్టడాలపై నగరపాలక సంస్థ అధికారులు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అనధికార కట్టడాలు కట్టిన నేతలకు వెన్నులో వణుకు పుడుతోంది. అక్రమంగా నెలకు లక్షల్లో సంపాదిస్తున్న వారి నోట్లో మట్టి కొట్టినట్లు అయ్యింది. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఒక వైసిపి ముఖ్య నేత బినామీల పేర్లతో అక్రమ కట్టడాలకు తెర లేపారు. కూటమి ప్రభుత్వం రావడంతో నగరపాలక సంస్థ అధికారులు కట్టడాలు కూల్చివేయడం మొదలుపెట్టారు. హైడ్రా తరహాలో నగరపాలక సంస్థ అధికారులు అనధికార కట్టడాలను కూల్చి వేస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డులోని లక్ష్మీ సెలబ్రేషన్స్ బార్ అండ్ రెస్టారెంట్ యజమాని ఖలీల్ రెండు సంవత్సరాల క్రితం దాదాపు కోటి రూపాయలతో అక్రమ కట్టడం నిర్మించి అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత ఖలీల్ కు మేయర్ తో సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి అధికారులు
పేరుకు మాత్రం నామమాత్రపు నోటీసులు జారీ చేసి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఇప్పుడు ఆ అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు. నగర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న కమిషనర్ పులి శ్రీనివాసులను నగరవాసులు అభినందిస్తున్నారు. ఇలాంటి అనధికారిక కట్టడాలు ఇంకా ఎన్ని ఉన్నాయో వాటిపై కూడా అధికారులు దృష్టి సారించాలని నగర ప్రజలు కోరుతున్నారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పై హత్యాయత్నం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం సురీందర్ తో కలిసి ఓ పెళ్లి వేడుకకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా. ఈ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లాకు భారీ భద్రత ఉంది.…
- ఆర్ అండ్ బీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష .రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని దీర్ఘకాలిక దృష్టితో ముందుకు తీసుకెళ్లాలని, 2047 విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి…
- ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి.పశ్చిమాసియా యుద్ధ సెగ ఐటీ ఉద్యోగులకు తగిలింది. ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి. ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్ హాస్టల్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని తెలిపాయి. కేవలం ముఖ్యమైన ఆహార…
- పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం,…
- సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది.సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం వారికి పలు అంశాలపై లక్ష్యాలను నిర్దేశించారు. సంక్షేమ, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అధికారులు-ప్రజాప్రతినిధుల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి