ఉపాధ్యాయుల కొరత ఉండడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో దిగిన సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుందిమెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఉన్నప్పటికీ పదవ తరగతి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు ఇద్దరే ఉన్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు రామాయంపేట గవ్వలపల్లి రహధారి శాలిపేట పాఠశాల ముందు రాస్తారోకోదిగారు.ఈ సందర్భంగా గ్రామ యువకులు విద్యార్థుల తల్లి తండ్రులు మాట్లాడుతూప్రాథమికోన్నత పాఠశాలను అప్ గ్రేట్ చేసి పదవ తరగతి వరకు చేసినప్పటికీ ఉపాధ్యాయుల కొరత కొనసాగుతుందన్నారు.సర్కారీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రం పలుమార్లు సంబంధిత అధికారులకు తెలిపినప్పటికీ స్పందన లేదని ఇటీవల పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం తగ్గిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వచ్చి సమస్య తీర్చే వరకు తాము రాస్తారోకో విరమించమంటూ పాఠశాల ముందు రోడ్డు పైనే వంటావార్పు నిర్వహిస్తున్నారు. సుమారు గంట నుండి విద్యార్థులు గ్రామస్తుల రాస్తారోక కొనసాగుతూనే ఉంది.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- చీరాలలో చెత్త నుంచి సంపద లక్ష్యం గాలిలోకేనా?ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో “చెత్త నుంచి సంపద” సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యం నేడు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పారిశుధ్యంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చీరాల పట్టణం… ఇప్పుడు చెత్త నిర్వహణలోనే తీవ్ర వైఫల్యాలకు నిలయంగా మారిందని…
- హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ..స్టార్ గా, పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హీరో కొత్త సినిమా ఆయన గత సినిమా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద, ఆ…
- ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు..ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఈ ప్రేమకథ వింటే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే..! సాధారణంగా పోలీసులు అంటే నేరస్తులకు భయం.. జైలర్ అంటే ఖైదీలకు వణుకు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. చట్టాన్ని కాపాడాల్సిన ఒక జైలు…
- విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్..పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలోని కైలాసగిరిపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు VMRDA సుమారు రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘త్రిశూల్ ప్రాజెక్టు’ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ…
- యాదాద్రిలో హాట్ టాపిక్ గా ప్రభుత్వ భూముల వివాదం..యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆలేరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీకే కాకుండా స్థానిక అధికార యంత్రాంగానికీ సవాలుగా మారాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







Total views : 70906