సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డీ మార్ట్ (D Mart) లోని ఫుడ్ ప్రొడక్ట్ లో చచ్చిపోయిన ఎలుక కలకలం సృష్టించింది…
రామచంద్రాపురం పరిధిలోని డీమార్ట్ (D Mart) లో వస్తువులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన ఓ కస్టమర్ పిల్లలు తినే స్నాక్స్ తీసుకునేందుకు ర్యాక్ వద్దకు వెళ్లగా చచ్చిపోయిన ఎలుక దర్శనమిచ్చింది. స్నాక్స్ ప్రొడక్ట్స్ తీసుకోగా అందులో నుంచి దుర్గంధం రావడంతో పరిశీలించిన కస్టమర్ కు క్షుణ్ణంగా పరిశీలించగా కుళ్ళిపోయిన ఎలుక కనిపించింది.దీంతో అవాక్కైనా సదరు కస్టమర్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. ఫుడ్ ప్రోడక్ట్ లో ఎలుక రావడంతో పక్కనున్న మిగిలిన కస్టమర్లు సైతం ఆందోళనకు దిగి స్టోర్ సిబ్బందిని నిలదీశారు.
డీమార్ట్ స్టోర్ లో సిబ్బంది నిర్లక్ష్యం..
నిత్యావసర సరుకులు కొనడానికి అనేకమంది కస్టమర్లు డీమార్ట్ కు వస్తారని అటువంటి స్టోర్ లో ఇంత నిర్లక్ష్యంగా సిబ్బంది వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. తప్పు జరిగిందని, చూసుకోలేదని డీ మార్ట్ నిర్వాహకులు దాటవేసే ప్రయత్నం చేశారు. ఈ విషయం బయటకు, మీడియాకు చెప్పొద్దని సదరు కస్టమర్ ను బతిమాలడి బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడ్డారు. వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ విషయంలో కలుగజేసుకొని అన్ని ప్రొడక్టుల క్వాలిటీ ని పరిశీలించి నిర్లక్ష్యంగా ఉన్న డీమార్ట్ యాజమాన్యంపై చర్యలకు ఉపక్రమించాలని పలువురు కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇది చదవండి : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ప్రకటన..
- తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది.decoding="async" width="150" height="150" src="https://cvrnews.net/wp-content/uploads/2026/03/speaker1-150x150.webp" class="attachment-thumbnail size-thumbnail wp-post-image" alt="" style="" srcset="https://cvrnews.net/wp-content/uploads/2026/03/speaker1-150x150.webp 150w, https://cvrnews.net/wp-content/uploads/2026/03/speaker1-25x25.webp 25w, https://cvrnews.net/wp-content/uploads/2026/03/speaker1-300x300.webp 300w, https://cvrnews.net/wp-content/uploads/2026/03/speaker1-90x90.webp 90w, https://cvrnews.net/wp-content/uploads/2026/03/speaker1-585x585.webp 585w" sizes="(max-width: 150px) 100vw, 150px" title="తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. 115cvrnews%">
తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్…


Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: డీ మార్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ లో చచ్చిన ఎలుక కలకలం..