43
గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రభుత్వ విప్ గణబాబు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటనను మర్చిపోయేలా వైసీపీ నేతలు డ్రామాలాడుతున్నారని ఆరోపించారు.
చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించినా, ఆ హామీని పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు.
సముద్రతీరంలో కనీస రక్షణ చర్యలు కల్పించడంతో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఇటీవల సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించిందని వెల్లడించారు. బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ కారి చిన్నా కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.




Total views : 211840