రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కేటీఆర్.. ప్రస్తుతం కౌన్సిలర్లపై వస్తున్న ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు ఎమ్మెల్యేగా ఎందుకు హాజరు కావడం లేదని, క్యాంపు కార్యాలయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని విమర్శించారు.సిరిసిల్లలో జరుగుతున్న నిర్మాణాల విషయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని… భూ కబ్జాలు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపు రాజకీయాలకు కేటీఆర్ అండగా ఉండకూడదని, వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్పై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేటీఆర్ స్పందించి ఆయనతో రాజీనామా చేయించాలని కోరారు. లేనిపక్షంలో కేటీఆర్ స్పందించే వరకు, అవసరమైతే ఆయన రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా.
34




Total views : 211860