వికారాబాద్ జిల్లాలో ఆశ్రమం మాటున జరుగుతున్న గంజాయి సాగు కలకలం రేపింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఆశ్రమంలో అక్రమంగా గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు.యాలాల మండలం గోవిందరావుపేట గ్రామ శివారులో హైదరాబాద్ బోరబండకు చెందిన పప్పులాల్ పది ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. అందులో 14 గుంటల స్థలంలో రాజస్థాన్కు చెందిన జైశ్రీరామ్ గిరి అనే స్వామీజీ.. మాతాజీతో కలిసి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి అమావాస్య రోజున భక్తులు ఈ ఆశ్రమానికి వస్తుంటారని పోలీసులు తెలిపారు.అయితే ఆశ్రమం వద్ద గంజాయి సాగు జరుగుతోందన్న సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు, తాండూరు రూరల్ పోలీసులు, యాలాల పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ఆశ్రమం ముందు పెంచుతున్న సుమారు 36 గంజాయి మొక్కలతో పాటు ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు.
వికారాబాద్ జిల్లాలో ఆశ్రమం మాటున గంజాయి సాగు.
27
previous post





Total views : 223582