Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Devotional శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.

శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.

by CVR NEWS
శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.

శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధి కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత కుమారుడు అనంత్ అంబానీ 48 కోట్ల విరాళాన్ని ప్రకటించినట్లు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. మూడ్రోజుల క్రితం అనంత్ అంబానీ శ్రీకాళహస్తి దేవస్థానానికి విచ్చేసిన సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం విరాళం కోరినట్లు చెప్పారు. శ్రీకాళహస్తి దేవస్థాన అభివృద్ధికి 10 కోట్లు, ఆలయంలో సెంట్రల్ ఏసీ ఏర్పాటుకు 3 కోట్లు, దేవస్థానం అనుబంధ గోశాల అభివృద్ధికి 5 కోట్లు విరాళంగా అందించేందుకు అంబానీ అంగీకారం తెలిపారని ఎమ్మెల్యే వెల్లడించారు. అలాగే… గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం అభివృద్ది కోసం 25 కోట్ల విరాళం ప్రకటించారని… అవసరమైతే మరో 10 కోట్ల వరకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అనంత్ అంబానీ పేర్కొన్నారని చెప్పారు. శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం ఆలయ అభివృద్ధి కోసం 48 కోట్ల విరాళం ప్రకటించిన అనంత్ అంబానీకి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విరాళాన్ని త్వరలోనే శ్రీకాళహస్తి దేవస్థానానికి అధికారికంగా అందజేయనున్నట్లు ఆయన చెప్పారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: