28
మ్యాప్ వివాదంలో చిక్కుకున్న నేపాల్ ఎయిర్లైన్స్.. భారత్కు క్షమాపణలు చెప్పింది. జమ్మూ, కశ్మీర్ను పాకిస్థాన్లో భాగంగా చూపుతూ ఉన్న తన నెట్వర్క్ మ్యాప్ను నేపాల్ ఎయిర్లైన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. క్షణాల్లో ఆ మ్యాప్ వైరల్ అయి విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే స్పందించిన నేపాల్ ఎయిర్లైన్స్ నష్ట నివారణ చర్యలకు దిగింది. భారత్కు క్షమాపణలు చెప్పింది.మా సోషల్ మీడియా ఛానెళ్లలో ఇటీవల పంచుకున్న నెట్వర్క్ మ్యాప్లోని లోపానికి మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నామని… ఆ మ్యాప్లో అంతర్జాతీయ సరిహద్దులకు సంబంధించి చాలా పెద్ద నిర్మాణ దోషాలు ఉన్నాయని… అవి నేపాల్, నేపాల్ ఎయిర్లైన్స్ అధికారిక అభిప్రాయాన్ని ప్రతిబింబించవు అని నేపాల్ ఎయిర్లైన్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.





Total views : 61414