ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో అమెరికాకు వెళ్తున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత. ఐతే అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్లు కొందరైతే..మరికొంత మంది సరైన ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు..ఈ నేపథ్యంలోనే అమెరికాలో కర్నూలుకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
కర్నూలు జిల్లాకు చెందిన చందు..అమెరికాలోని చికాగోలో ఎంఎస్ పూర్తి చేశాడు. కొంతకాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పటికీ, రాకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న చందు పిస్టల్తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కొడుకు మృతితో సెక్యూరిటీ గార్డ్గా ఉద్యోగం చేస్తూ తన కుమారుడిని చదివించిన తండ్రి ఆశలు ఒక్కసారిగా కూలిపోయాయి. ఇక చందు మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.




Total views : 61803