తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టి. నాగయ్య (T. Nagayya) అర్ధరాత్రి 2 గంటలకు గుండెపోటుతో తన స్వగ్రామమైన బెల్లంపల్లి లో మృతి చెందారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నాగయ్య కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో సీనియర్ నాయకులుగా, మేధావిగా గుర్తింపు పొందారు. టి. నాగయ్య మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నాగయ్య లాంటి విద్యావంతులు, మేధావి, ఉద్యమ కారుడి అకాల మరణం కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి తన జీవితకాలం పార్టీ విస్తృతం చేసేందుకు కృషి చేసిన నాయకులు నాగయ్య అని ఆయన అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…మార్కాపురం జిల్లాలోని పొదిలి నగర పంచాయితీ అభివృద్ధి విషయంలో రోజురోజుకు దిగజారుతోంది. మేజర్ పంచాయితీ నుంచి నగర పంచాయితీగా అప్గ్రేడ్ అయిన తర్వాత అభివృద్ధి వేగం పెరుగుతుందని ప్రజలు ఆశించారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. గత…
- ట్రంప్ను టార్గెట్ నిందితుడి వీడియో వైరల్..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైట్హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వేదికగా జరిగిన ఆ ఘోర కలికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియోను యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు విడుదల చేశారు. నిందితుడు కోల్ థామస్…
- మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం..హృదయాన్ని కదిలించే విషాద ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది.బోటు ప్రమాదంలో ఓ తల్లి చూపించిన ప్రేమ.. అందరినీ కంటతడి పెట్టిస్తోంది.కళ్ల ముందు మృత్యువు కనిపిస్తున్నా తన చిన్నారి కొడుకును కాపాడుకోవాలని ఆ తల్లి చివరి క్షణం వరకు పోరాడింది.మరణం అంచున ఉన్నా ఆ…





Total views : 61986