ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ శాఖలను మరింత బలోపేతం చేయడంతో పాటు, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.
సుమారు 1,299 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ కార్యాలయ సముదాయం ద్వారా …అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో పనిచేసే అవకాశం కలుగనుంది. పరిపాలనా సామర్థ్యం పెరగడమే కాకుండా, శాఖల మధ్య సమన్వయం మెరుగుపడుతోంది.
ఇదే సమయంలో కేంద్ర ఉద్యోగుల కోసం సుమారు 1,235 కోట్ల రూపాయల వ్యయంతో జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో 1,504 నివాస గృహాలు, ఆధునిక సదుపాయాలతో కూడిన నివాస సముదాయం నిర్మించనున్నారు. కార్యాలయాలు, నివాస సముదాయాల నిర్మాణంతో అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు మరింత విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలకు ఈ ప్రాజెక్టులు గణనీయమైన ఊతమిస్తాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి పరిపాలనా మౌలిక సదుపాయాల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారానికి.. ఈ ఆమోదం నిదర్శనమని ఆయన అభినందించారు. మొత్తం మీద ₹2,534 కోట్ల విలువైన ఈ రెండు ప్రాజెక్టులు అమరావతి అభివృద్ధి వేగాన్ని మరింత పెంచనున్నాయనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది..
అమరావతికి కేంద్ర కేబినెట్ వరాలు జల్లు.
118
previous post



Total views : 203021