ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో పొందేందుకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెస్తున్నామని ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో RTGS సేవలపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు..ప్రజలకు అందించే ప్రభుత్వ సేవల్లో ఎలాంటి ఇబ్బందులూ ఎదురవకుండా చూడాలన్నారు. ప్రభుత్వం అందించే అన్ని సేవలనూ ఆన్లైన్ చేశామని తెలిపారు. మన మిత్ర వాట్సాప్ ద్వారా ఆన్లైన్లో ప్రభుత్వ సేవలను వినియోగించుకునేందుకు అవగాహన పెంచాలని ఆదేశించారు. ఆన్లైన్లో ప్రభుత్వ సేవలను వినియోగించుకునేలా ఆన్లైన్ యాప్ను రూపొందించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల తరహాలోనే గ్రామీణ ప్రాంతాల్లోనూ అదే తరహా సేవలు అందించాలన్నారు. ప్రజలకు తాగునీటి సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు. రక్షిత మంచినీటి ట్యాంకులు, పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్న మంచినీటి శాంపిళ్లను ప్రతిరోజూ పరీక్షించాలని స్పష్టం చేశారు. రక్షిత నీటి సరఫరాలో అశ్రద్ధ ఉండొద్దని..మంచినీటి సరఫరా పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత ఉండాలన్నారు. ప్రజల్లో అవగాహన వస్తేనే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలను విజయవంతం చేయగలమని చెప్పారు. ప్రకృతి, పరిసరాల శుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన పెంచేలా వినూత్న కార్యక్రమం చేపట్టాలని సూచించారు. జలధార కార్యక్రమం ఫలితాలు కనిపించాలని, చెరువులన్నీ నిండేలా చర్యలు చేపట్టాలన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టాలని, ప్రతి కుంట, ప్రతి చెరువులోని నీటి నిల్వను ఆన్లైన్లో సమీక్షించాలని నిర్దేశించారు. అనంతపురం జిల్లాలో ఆన్లైన్ పరిశీలనా విధానాన్ని అమలు చేయాలన్నారు. మహిళలపై నేరాలను అరికట్టాలని, గంజాయిని అరికట్టేందుకు మూలాల్లోకి వెళ్లాలని ఆదేశించారు. మహిళలపై దాడులు చేయాలంటేనే భయపడేలా శిక్షలు ఉండాలని స్పష్టం చేశారు.
ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు.
119
previous post




Total views : 202948