పోలాండ్ రాజధాని వార్సాలో జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ 7న హ్యూమనాయిడ్, క్వాడ్రుపెడ్ రోబోలు వీధుల్లో మార్చ్ నిర్వహించాయి. పోలాండ్ డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట రోబోలు జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ కనిపించాయి. అయితే ఇది నిజమైన రోబో తిరుగుబాటు మాత్రం కాదు. డెమోక్రాటిజం, పోలిష్ రోబోటిక్స్ సంస్థ డెల్టా రోబోట్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. “ఉద్యోగాలను కాపాడండి”, “నిబంధనలు తీసుకురావాల్సిన సమయం వచ్చింది” అంటూ ముందుగా రికార్డు చేసిన సందేశాలను రోబోలు ప్రసారం చేశాయి. కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్ కారణంగా భవిష్యత్లో ఉద్యోగాలపై ఏర్పడుతున్న ఆందోళనను చర్చకు తీసుకురావడమే ఈ ప్రదర్శన ప్రధాన ఉద్దేశం. అదే సమయంలో ఈ కార్యక్రమం డెల్టా రోబోట్స్ సంస్థకు ప్రచారంగా కూడా మారింది. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఉద్యోగాల భద్రత, AI నియంత్రణపై ప్రపంచవ్యాప్తంగా చర్చ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోబో మార్చ్ ప్రత్యేకంగా నిలిచింది.
పోలాండ్లో రోబోల వినూత్న నిరసన.
39
previous post