మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్,పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నారాయణ సమావేశమై జిల్లా రాజకీయాలపై కీలకమైన చర్చలు జరిపారు.ఆహ్వానం మేరకు తన నివాసానికి వచ్చిన సహచర మంత్రులకు ఆనం సాదర స్వాగతం పలికారు.జిల్లావ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే ఏకైక అజెండాగా సాగిన ఈ భేటీలో ముగ్గురు మంత్రులు సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. నియోజకవర్గాల వారీగా క్యాడర్ను ఎలా బలోపేతం చేయాలి, పార్టీ పరంగా రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలనే అంశాలపై ఒక పక్కా వ్యూహాన్ని,మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేశారు.ముగ్గురు కీలక మంత్రులు ఒకే చోట చేరి పార్టీ పటిష్టత కోసం ప్రత్యేకంగా దృష్టి సారించి వ్యూహ రచన చేయడం ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.
నెల్లూరు జిల్లా రాజకీయాలపై మంత్రులు ఫోకస్.
137
previous post




Total views : 203026