Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home Telangana ఎన్నికల బరిలో ఇండిపెండెంట్ అభ్యర్థులు..

ఎన్నికల బరిలో ఇండిపెండెంట్ అభ్యర్థులు..

by Rama
Elections

ఎన్నికల (Elections) బరిలో నిలిచే ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయిస్తారు. గత ఎన్నికలతో పోలిస్తే పోటీలో ఉన్న ఇండిపెండెంట్ల సంఖ్య పెరిగింది. ఓట్లు రాకున్నా బరిలో నిలిచేందుకు ఇండిపెండెంట్లు ఆసక్తి చూపుతున్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

జీహెచ్ఎంసీ పరిధిలోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి. ఎంపీ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని మెజారిటీ సీట్లను దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.

జీహెచ్ఎంసీ పరిధిలోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ దఫా మొత్తం 66 మంది ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు. హైద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో 30 మంది పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో 09 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.హైద్రాబాద్ ఎంపీ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ స్థానంలో ఎంఐఎంను ఓడించాలని బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. పాతబస్తీపై బీజేపీ కేంద్రీకరించింది.

సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుండి 45 మంది బరిలో నిలిచారు. ఇందులో 21 మంది ఇండిపెండెంట్లు. గత ఎన్నికల్లో 15 మంది ఇండిపెండెంట్లు పోటీ చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి 43 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 21 మంది ఇండిపెండెంట్లు. 2019లో ఇదే స్థానం నుండి ఐదుగురు మాత్రమే పోటీ చేశారు. చేవేళ్ల స్థానం నుండి 22 మంది బరిలో నిలిచారు. ఇందులో 11 మంది ఇండిపెండెట్లు. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుండి 8 మంది పోటీ చేశారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో నిలిచిన ఇండిపెండెంట్లు ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకు నామమాత్రంగానే ఓట్లు పోలయ్యాయి. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు చీల్చిన ఓట్లు ప్రధాన పార్టీల గెలుపు, ఓటములపై ప్రభావం చూపుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇండిపెండెంట్లకు కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో 500 ఓట్లు కూడా రాలేదు. హైద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్లలో పోటీ చేసిన స్వతంత్రులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రధాన పార్టీలకు పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.
    ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్‌సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
  • నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.
    నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
  • నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.
    నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: