Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra Pradesh సీతంపేటలో నూతన సబ్ డిపో ప్రారంభం.

సీతంపేటలో నూతన సబ్ డిపో ప్రారంభం.

by CVR NEWS

పార్వతిపురం మన్యం జిల్లా కురుపాం మండలం సీతంపేట గ్రామ ప్రజలకు ఊరట కలిగింది. ఎన్నో ఏళ్లుగా రేషన్ సరుకుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల సమస్యకు పరిష్కారం లభించింది. సీతంపేట గ్రామంలో నూతన సబ్ డిపో కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కలిసి ప్రారంభించారు. సబ్ డిపో అందుబాటులోకి రావడంతో ఇకపై రేషన్ సరుకుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా సబ్ డిపో లేకపోవడంతో నిత్యావసర సరుకుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని.. దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. సబ్ డిపో ప్రారంభంతో తమ కష్టాలు తీరనున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామస్తులకు అధికారులు టాయిలెట్ల వినియోగం, పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో ప్రభుత్వ సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: