Monday, July 27, 2026
News Navigation
Monday, July 27, 2026
News Navigation

Breaking

Monday, July 27, 2026
Home Sports జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

by CVR NEWS

UK పర్యటనలో నిరాశపరిచిన తర్వాత భారత్ కోరుకున్న ఫలితం ఇదే. జింబాబ్వే గడ్డపై ఆ జట్టును పూర్తిగా అధిగమించి 3-0 తేడాతో క్లీన్ స్వీప్ పూర్తి చేసింది. వాస్తవానికి ఈ సిరీస్ అంతటా జింబాబ్వే జట్టు భారత్కు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. భారత్ కొత్త T20I కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు ఇది మరపురాని మైలురాయి. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలలో విజయాలు సాధించలేకపోయిన ఆయన, ఇప్పుడు తన కెప్టెన్సీలో తొలి సిరీస్ విజయాన్ని నమోదు చేశారు.

భారత్ నిర్దేశించిన అత్యధిక లక్ష్య ఛేదనలో జింబాబ్వే ఎక్కడా కోలుకున్నట్లు కనిపించలేదు. మయాంక్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతికే బ్రియాన్ బెన్నెట్ అవుట్ కాగా, ఆ తర్వాత పవర్ప్లేలో బెన్ కరన్, డియాన్ మైయర్స్ భారత్పై ఎటువంటి ఒత్తిడి తెవలేకపోయారు. యశ్ ఠాకూర్ వరుస బంతుల్లో డియాన్ మైయర్స్, సికందర్ రజాలను పెవిలియన్‌కు పంపడంతో జింబాబ్వే ఆశలు దాదాపుగా ముగిశాయి.

రైన్ బర్ల్ పోరాడి అర్ధశతకం సాధించినప్పటికీ, జింబాబ్వే విజయానికి దూరంగానే నిలిచింది. చివరకు భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: