Thursday, March 12, 2026
News Navigation

Breaking

Thursday, March 12, 2026
Home Andhra Pradesh తుఫాను భయంతో వణికి పోతున్న కాకినాడ ప్రజలు

తుఫాను భయంతో వణికి పోతున్న కాకినాడ ప్రజలు

by Rama
తుఫాను భయంతో వణికి పోతున్న కాకినాడ ప్రజలు

కాకినాడ జిల్లా ప్రజలు తుఫాను భయంతో వణికి పోతున్నారు. రాష్ట్రానికి పెద్దగా తుఫాన్ ఎఫెక్ట్ ఉండదని అధికారులు చెప్పినప్పటికీ తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఉప్పడ సముద్రం వద్ద కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఉప్పాడ, కొత్తపల్లి ప్రాంతంలో కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే పంట కోతలు పూర్తి కాగా రైతులు ధాన్యం ఆరబోసుకున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉండడంతో ఎండకు ఆరబెట్టి ధాన్యం విక్రయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వర్షం వల్ల రైతులు ఆరబోసుకున్న ధాన్యం తడిసిముద్దయ్యింది. చాలా మంది రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే వెనక్కు పంపుతారన్న భయంతో తక్కువ ధరకే మిల్లర్లుకు అమ్మేస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.