ఏపీలో ప్రభుత్వ వైద్య సేవలను నిర్వీర్యం చేస్తున్న వైద్యులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఏళ్ల తరబడి అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 43 మంది డాక్టర్లను ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్య సేవల్లో బాధ్యతారాహిత్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని ఈ చర్యల ద్వారా స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వయంగా వెల్లడించారు. నాలుగేళ్లుగా ఈ 43 మంది వైద్యులు తమ విధులకు హాజరుకావడం లేదని ప్రభుత్వం గుర్తించింది. దీనిపై వారికి పలుమార్లు సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేసింది. వారిపై అభియోగాలు కూడా నమోదు చేసినప్పటికీ, వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారిని సర్వీసుల నుంచి శాశ్వతంగా తప్పించాలని నిర్ణయించినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత నెలలో కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న 51 మందిని శాశ్వతంగా తొలగించారు. వీరిలో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు ఉన్నారు. తాజా చర్యలతో పాటు మరో 34 మంది వైద్యులపై అభియోగాలు నమోదు చేసి నోటీసులు ఇవ్వగా… వారు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో 15 మంది రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది.
ఆంధ్రప్రదేశ్లో 43 మంది వైద్యుల డిస్మిస్.
29
previous post





Total views : 149266