Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ ఎస్ఐపీబీ సమావేశం.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ ఎస్ఐపీబీ సమావేశం.

by CVR NEWS
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ ఎస్ఐపీబీ సమావేశం

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 18వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో పలు కీలక రంగాలకు చెందిన ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.అమరావతిలోని ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 18వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. ఇంధన, ఐటీ, ఎలక్ట్రానిక్స్, పర్యాటక, పరిశ్రమలు, పెట్టుబడులు-మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. మొత్తం 50కి పైగా ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించిన ఎస్ఐపీబీ, వాటికి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడం, ఉపాధి అవకాశాల సృష్టి, పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

026147
Total views : 149969

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.