31
మా స్థలాన్ని కాపాడండి మహాప్రభో అంటూ ఓ మానసిక వికలాంగుడు రెవిన్యూ కార్యాలయ గడప తట్టాడు. విశాఖ జిల్లా భీమిలి మండలం నగరపాలెం పంచాయతీలో తమ కుటుంబానికి చెందిన భూమిని ఇతరులు కబ్జా చేశారని ఆరోపిస్తూ ఎమ్మార్వోకు విన్నవించాడు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. సుమారు ఎకరం 32 సెంట్ల భూమిని ఇతరులు అక్రమంగా ఆక్రమించుకున్నారని బాధితుడు ఆరోపించాడు. అడంగల్లో పేరు మార్పును ఆధారంగా చేసుకుని ఇప్పుడు భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశాడు. తమ భూమిని కాపాడాలని అధికారులను వేడుకున్నాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించామని, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పేర్కొన్నారు.





Total views : 149305