31
రాయలసీమ యూనివర్సిటీలో అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన విద్యార్థి సంఘాల నాయకులను బహిష్కరించడం వివాదాస్పదంగా మారింది. విద్యార్థుల గొంతును నొక్కివేయడమే లక్ష్యంగా యూనివర్సిటీ యాజమాన్యం వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన విద్యార్థి నేతలు బహిష్కరణ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే విద్యార్థి సంఘాల నాయకులను వీసీ, రిజిస్ట్రార్ కలిసి బహిష్కరించారని ఆందోళనకారులు ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై చర్యలు తీసుకోవడం కాకుండా, ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు.





Total views : 149305