నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ కావడంపై ఆ విద్యాసంస్థ ప్రిన్సిపాల్ ఎం. రమ్యశ్రీ హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత బాలికలకు ఇది ఎంతో ఉపయోగకరమైన నిర్ణయమని పేర్కొన్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక చొరవతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. జూనియర్ కళాశాలలో ఎంసీపీసీ, బైపీసీ గ్రూపుల్లో తలో 40 సీట్లు అందుబాటులోకి రానుండటంతో విద్యార్థినులు వైద్య, ఇంజినీరింగ్, సైన్స్ రంగాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు మరింత విస్తరించనున్నాయని తెలిపారు. ఇంటర్ విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే నాణ్యమైన విద్యను పొందే అవకాశం కలగడం తల్లిదండ్రులకు కూడా ఊరటనిస్తుందని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గురుకుల విద్యాసంస్థ విద్యార్థినుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని ప్రిన్సిపాల్ ఎం. రమ్యశ్రీ పేర్కొన్నారు.
ఆత్మకూరు బీసీ బాలికల గురుకులానికి జూనియర్ కళాశాల హోదా
30
previous post






Total views : 149588