168
తిరుపతి జిల్లా పిచ్చాటూరు లో కూటమి ప్రభుత్వ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రెండేళ్లలోనమ్మకం, సంక్షేమం,అభివృద్ధికి చిరునామాగా చంద్రన్న ప్రభుత్వం నిలిచిందన్నారు టీడీపీ నేతలు పనపాక లక్ష్మి, శంకర్ రెడ్డి. సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధి కోసం రెండేళ్లలో 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. సత్యవేడును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దడమే మా లక్ష్యమన్నారు. జగన్ రెడ్డి లాంటి అరాచకశక్తి మళ్లీ అధికారంలోకి రాకూడదన్నారు. మరో 20 ఏళ్లు కూటమి ప్రభుత్వం కొనసాగడం ఖాయమనీ ధీమా వ్యక్తం చేశారు.