అనకాపల్లి జిల్లా పరవాడలో భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 490 కేసుల్లో పట్టుబడిన 20 వేల 876 కిలోల గంజాయి, 23 కిలోల హాశిష్ ఆయిల్ను కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో నాశనం చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఐజీ గోపీనాథ్ జట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై ఎన్డీఏ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టామని పేర్కొన్నారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని, గంజాయి కేసుల విచారణను వేగవంతం చేస్తూ జాతీయ, అంతర్జాతీయ ముఠాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి స్పష్టం చేశారు.
అనకాపల్లి జిల్లా పరవాడలో 20,876 కేజీల గంజాయి ధ్వంసం.
36
previous post






Total views : 149306