53
ఏపీ మంత్రి నారాయణ మలేషియాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం మలేషియా చేరుకున్న మంత్రి నారాయణ కు ఘన స్వాగతం లభించింది.కౌలాలంపూర్ లోని భారత హైకమిషన్ కార్యాలయంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రి నారాయణతో క్లాంగ్ ఎంపీ గణపతిరావు,మంత్రి పప్పారాయుడు భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చలు జరిపారు.సెలంగార్ లోని KDEB వేస్ట్ మేనేజ్ మెంట్ సంస్థ కార్యాలయంలో మంత్రికి మలేషియా అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. మలేషియాలోని ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ లను మంత్రి సందర్శించనున్నారు. మంత్రి వెంట మున్సిపల్ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉన్నారు.






Total views : 150012