పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో కలుషిత నీరు తాగి వాంతులు విరోచనాలతో 15 మందికి తీవ్ర అస్వస్థత నెలకొంది . అస్వస్థకు గురైన వారిలో వృద్దులు 04, పిల్లలు 03, మహిళలు 8 మంది ఉన్నారు. మినరల్ వాటర్ ప్లాంట్లు, ప్రభుత్వ వాటర్ ట్యాంకులు శుభ్రం చేయకుండా వినియోగిస్తుండడంతో కలుషిత నీరు తాగి కేసానుపల్లి గ్రామంలో 15 మంది కి వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థకు గురవడంతో బాధితుల ను స్థానిక ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు . ఈ సంఘటనతో గ్రామంలో మెడికల్ సిబ్బంది క్యాంప్ ఏర్పాటు చేసి పరిస్థితి ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శి గ్రామ సర్పంచ్ గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంకులు సైడ్ కాలువలు శుభ్రం చేపించి శానిటేషన్ బ్లీచింగ్ లాంటి కార్యక్రమాలు చేపట్టారు . ఆర్వో అధికారులు గ్రామంలో అన్ని వాటర్ ట్యాంకులను, బోర్లను తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే గ్రామానికి చేరుకున్న దాచేపల్లి ఎమ్మార్వో ఎంపీడీవో పరిస్థితులను ఎప్పటికప్పుడే పర్యవేక్షిస్తున్నారు .
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి