Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Telangana కలుషిత నీరు తాగి వాంతులు విరోచనాలతో 15 మందికి తీవ్ర అస్వస్థత

కలుషిత నీరు తాగి వాంతులు విరోచనాలతో 15 మందికి తీవ్ర అస్వస్థత

by Satya
కలుషిత నీరు తాగి వాంతులు విరోచనాలతో 15 మందికి తీవ్ర అస్వస్థత

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో కలుషిత నీరు తాగి వాంతులు విరోచనాలతో 15 మందికి తీవ్ర అస్వస్థత నెలకొంది . అస్వస్థకు గురైన వారిలో వృద్దులు 04, పిల్లలు 03, మహిళలు 8 మంది ఉన్నారు. మినరల్ వాటర్ ప్లాంట్లు, ప్రభుత్వ వాటర్ ట్యాంకులు శుభ్రం చేయకుండా వినియోగిస్తుండడంతో కలుషిత నీరు తాగి కేసానుపల్లి గ్రామంలో 15 మంది కి వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థకు గురవడంతో బాధితుల ను స్థానిక ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు . ఈ సంఘటనతో గ్రామంలో మెడికల్ సిబ్బంది క్యాంప్ ఏర్పాటు చేసి పరిస్థితి ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శి గ్రామ సర్పంచ్ గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంకులు సైడ్ కాలువలు శుభ్రం చేపించి శానిటేషన్ బ్లీచింగ్ లాంటి కార్యక్రమాలు చేపట్టారు . ఆర్వో అధికారులు గ్రామంలో అన్ని వాటర్ ట్యాంకులను, బోర్లను తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే గ్రామానికి చేరుకున్న దాచేపల్లి ఎమ్మార్వో ఎంపీడీవో పరిస్థితులను ఎప్పటికప్పుడే పర్యవేక్షిస్తున్నారు .

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

  • ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.
    పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌ సింగ్‌ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సుకు పుతిన్‌ స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై…
  • పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.
    పోలాండ్‌ రాజధాని వార్సాలో జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్‌ 7న హ్యూమనాయిడ్‌, క్వాడ్రుపెడ్‌ రోబోలు వీధుల్లో మార్చ్‌ నిర్వహించాయి. పోలాండ్‌ డిజిటల్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట రోబోలు జెండాలు ఊపుతూ, నినాదాలు…
  • నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.
    గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
  • మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.
    మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్ జిల్లాలో వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు వాహనాలు తీవ్రంగా…
  • ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.
    ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: