Wednesday, April 22, 2026
News Navigation
Wednesday, April 22, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Devotional శ్రీ కోదండ రాముని దేవాలయం ఎక్కడ ఉందొ తెలుసా..!

శ్రీ కోదండ రాముని దేవాలయం ఎక్కడ ఉందొ తెలుసా..!

by Satya
Sri Kodanda Rama Temple

అనంతపురం(Anantapur)లోని అతి ప్రాచీనమైన శ్రీరాముడు దేవాలయాల్లో(Sri Rama Temples) ఒకటి శ్రీ కోదండ రాముని దేవాలయం(Sri Kodanda Rama Temple). ఈ దేవాలయం అనంతపురం నగరంలోని పాతూరులో సున్నపు గేర్ల వద్ద కలదు. దాదాపుగా 300 సంవత్సరాల పై చిలుకు క్రితమే నిర్మించబడి ఉన్నదని ఇక్కడే చరిత్ర, పురోహితుల ద్వారా తెలుస్తోంది. ఈ దేవాలయం మొదటగా అనంతపురం నగరానికి చెందిన కోనేటి వంశస్థుల ద్వారా నిర్మించబడినది అని చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. అయితే మొదటగా ఈ ప్రాంతం పంట పొలాలతో ఉండేదని ఇక్కడ ఒక చెరువు కూడా నిర్మించబడి ఉండాలని ఆ చెరువు కట్ట పైన నిర్మించబడి ఉన్న మొదటిగా ఈ కోదండరాముడు దేవాలయమును ఆ తర్వాత కోనేటి వంశస్థులు దీనిని నిర్మించి అభివృద్ధి చేశారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

ఇంతటి చరిత్ర గల కోదండరాముని దేవాలయమును భక్తులు భక్తిశ్రద్ధలతో నిష్టుతో పూజిస్తూ ఉంటారు. ఇక్కడ దేవాలయంలో శ్రీరామునికి అర్చనలు, భజనలు, కీర్తనలు మరియు ఉట్ల పరస ఘనంగా నిర్వహిస్తారు. ఇంతటి చరిత్ర గల దేవాలయమును దేవాదాయ శాఖ గుర్తించి వీటి నిర్వహణ ఈ శాఖ ద్వారానే నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయంలో స్థాపితమైన సీతారాముని విగ్రహం , లక్ష్మణుడి విగ్రహం ఎంతో తేజస్సుతో దర్శనమిస్తారు. ఇక్కడ నవగ్రహాల పూజలు చేయడానికి కూడా నవగ్రహాల విగ్రహాలు ఉన్నాయి. ఆంజనేయస్వామి విగ్రహం కూడా ఇక్కడ ఎంతో తేజస్తో దర్శనమిస్తుంది. వేపచెట్టు బోధి వృక్షం రెండూ కలిసి ఇక్కడ వెలిసాయి. ఈ చెట్లకు పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. అంతేకాక శ్రీ కోదండ స్వామికి ఇక్కడ నిత్యం పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ శ్రీరాముని కొలిచినవారి కోరికలను స్వామివారు తప్పకుండా నెరవేస్తారని ఎంతోమంది భక్తులు గాఢంగా విశ్వసిస్తారు.


  • ఈ నెల 22న తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ఆలయం..
    చార్‌ధామ్‌ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. యమునోత్రి, గంగోత్రి ఆలయాల ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ నెల 22న కేదార్‌నాథ్ ఆలయం, 23న ఉదయం 6.15కు బద్రీనాథ్ ఆలయాలను ఓపెన్‌ చేస్తారు. ఈ యాత్ర నవంబర్ వరకు కొనసాగనుంది. ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న వారికి…
  • రాష్ట్ర దేవాదాయ శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ డాక్టర్ ఎం. హరిజవహర్ లాల్..
    రాష్ట్ర దేవాదాయ శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ డాక్టర్ ఎం. హరిజవహర్ లాల్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో దేవస్థానం అర్చక బృందం స్వాగతం పలికిన అనంతరం, వారు అమ్మవారికి ప్రత్యేక…
  • కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు..
    కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని మంత్రి కందుల దుర్గేష్‌కు దిశానిర్దేశం చేశారు. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

007267
Total views : 47741

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.