30
తిరుపతి రూరల్ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో కొలువుదీరిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీవేంకటేశ్వరస్వామివారు నడిచిన పవిత్ర మార్గంగా భక్తులు విశ్వసించే చారిత్రక ప్రాధాన్యత ఉన్న శ్రీవారిమెట్టు ప్రాంతంలో ఈ వేడుక కనులపండువగా సాగింది.ఆలయం నుంచి ఉత్సవమూర్తులు మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ కోలాహలంగా ఊరేగింపుగా బయలుదేరి శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకున్నారు.



Total views : 221442