అనంతపురం(Anantapur)లోని అతి ప్రాచీనమైన శ్రీరాముడు దేవాలయాల్లో(Sri Rama Temples) ఒకటి శ్రీ కోదండ రాముని దేవాలయం(Sri Kodanda Rama Temple). ఈ దేవాలయం అనంతపురం నగరంలోని పాతూరులో సున్నపు గేర్ల వద్ద కలదు. దాదాపుగా 300 సంవత్సరాల పై చిలుకు క్రితమే నిర్మించబడి ఉన్నదని ఇక్కడే చరిత్ర, పురోహితుల ద్వారా తెలుస్తోంది. ఈ దేవాలయం మొదటగా అనంతపురం నగరానికి చెందిన కోనేటి వంశస్థుల ద్వారా నిర్మించబడినది అని చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. అయితే మొదటగా ఈ ప్రాంతం పంట పొలాలతో ఉండేదని ఇక్కడ ఒక చెరువు కూడా నిర్మించబడి ఉండాలని ఆ చెరువు కట్ట పైన నిర్మించబడి ఉన్న మొదటిగా ఈ కోదండరాముడు దేవాలయమును ఆ తర్వాత కోనేటి వంశస్థులు దీనిని నిర్మించి అభివృద్ధి చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇంతటి చరిత్ర గల కోదండరాముని దేవాలయమును భక్తులు భక్తిశ్రద్ధలతో నిష్టుతో పూజిస్తూ ఉంటారు. ఇక్కడ దేవాలయంలో శ్రీరామునికి అర్చనలు, భజనలు, కీర్తనలు మరియు ఉట్ల పరస ఘనంగా నిర్వహిస్తారు. ఇంతటి చరిత్ర గల దేవాలయమును దేవాదాయ శాఖ గుర్తించి వీటి నిర్వహణ ఈ శాఖ ద్వారానే నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయంలో స్థాపితమైన సీతారాముని విగ్రహం , లక్ష్మణుడి విగ్రహం ఎంతో తేజస్సుతో దర్శనమిస్తారు. ఇక్కడ నవగ్రహాల పూజలు చేయడానికి కూడా నవగ్రహాల విగ్రహాలు ఉన్నాయి. ఆంజనేయస్వామి విగ్రహం కూడా ఇక్కడ ఎంతో తేజస్తో దర్శనమిస్తుంది. వేపచెట్టు బోధి వృక్షం రెండూ కలిసి ఇక్కడ వెలిసాయి. ఈ చెట్లకు పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. అంతేకాక శ్రీ కోదండ స్వామికి ఇక్కడ నిత్యం పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ శ్రీరాముని కొలిచినవారి కోరికలను స్వామివారు తప్పకుండా నెరవేస్తారని ఎంతోమంది భక్తులు గాఢంగా విశ్వసిస్తారు.
- హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది. రామనామ స్మరణలతో కొండగట్టు గిరులు మార్మోగుతున్నాయి. పచ్చని కొండ కాషాయ వర్ణాన్ని సంతరించుకుంది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా మాలదీక్ష భక్తులు కాలినడకన కొండపైకి చేరుకుని…
- గుజరాత్లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో పర్యటించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయ పునఃప్రారంభానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ‘సోమనాథ్ అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని…
- పురాతన శివాలయం కూల్చివేతపై వివాదం..వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో కాకతీయుల నాటి పురాతన శివాలయం కూల్చివేత వివాదంగా మారింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో 700 నుంచి 800 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని కూల్చివేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అశోక్ నగర్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 74520