Monday, August 10, 2026
News Navigation
Monday, August 10, 2026
News Navigation

Breaking

Monday, August 10, 2026
Home Devotional తిరుపతి జిల్లా రామచంద్రాపురం శ్రీ శక్తి పీఠంలో ఘనంగా వారాహి ఉత్సవాలు.

తిరుపతి జిల్లా రామచంద్రాపురం శ్రీ శక్తి పీఠంలో ఘనంగా వారాహి ఉత్సవాలు.

by CVR NEWS

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం శ్రీ శక్తి పీఠంలో శ్రీ వారాహి అమ్మవారి ఆషాఢ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు, వారాహి మంత్ర హోమాల్లో పాల్గొంటున్నారు. తిరుమల–తిరుపతి ప్రాంతమంతా వరాహ శక్తి ఆధీనంలోనే ఉందని, శ్వేత వరాహకల్పంలో భూదేవిని ఉద్ధరించిన వరాహమూర్తి శక్తి స్వరూపమే శ్వేత వారాహి దేవి అని శ్రీ శక్తి పీఠాధిశ్వరి మాతాజీ రమ్యానంద భారతి తెలిపారు. అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే కోరికలు నెరవేరి, జీవితంలోని అడ్డంకులు తొలగుతాయని పేర్కొన్నారు. జూలై 23న వారాహి అమ్మవారి కళ్యాణోత్సవం, జూలై 25న వారాహి హోమం పూర్ణాహుతితో నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నట్లు వెల్లడించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: