కడప జిల్లా(Kadapa District) జమ్మలమడుగు(Jammalamadugu)లోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి(Sri Narapura Venkateswara Swamy) బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కల్యాణోత్సవాన్ని వేద పండితులు సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీనారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయానికి పురాతన ప్రాశస్త్యం ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని సౌకర్యాలు కల్పించింది. పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్క గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ.అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ. పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే సంబంధిత పనులు పూర్తి చేస్తామన్నారు. అనంతవరం, నెక్కలు గ్రామసభలకు మంత్రి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి…
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
- అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


