భద్రాచలం(Bhadrachalam)లోని శ్రీసీతారాముల(Sri Sitaram) కళ్యాణానికి ముహూర్తం ఖరారు అయ్యింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతికుమారి స్వామివారి(CS Shantikumari Swamivari)కి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందించనున్నారు.
ఇది చదవండి: మహాశివుని ‘సోమనాథ్’ ఆలయం విశేషాలు..!
ఇదిలా ఉంటే శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లతోపాటు చలువ పందిళ్లు వేశారు. స్వామి వారి కళ్యాణ వేడుకలు వీక్షించేందుకు మొత్తం 24 సెక్టార్లు ఏర్పాటు చేశారు. ప్రతి సెక్టార్లో ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈ నెల 22న తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం..
- రాష్ట్ర దేవాదాయ శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ డాక్టర్ ఎం. హరిజవహర్ లాల్..
- కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు..





Total views : 47731