131
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఏలూరు వద్ద ఈనెల 1న జరిగిన షేక్ జాకీర్ హుస్సేన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మొదట్లో దీనిని అనుమానాస్పదమృతిగా భావించారు .ఇప్పుడు ఇది అనుమానాస్పద మృతి కాదు, వివాహేతర సంబంధం వల్ల జరిగిన ఘోర హత్యగా నిర్ధారించారు. మృతుడి భార్య షఫియా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి ప్రియురాలని విచారించగా అసలు విషయం బయట పడింది . ప్రియురాలు మనీష, ఆమె భర్త కాలేషా వలి పథకం ప్రకారమే తాడుతో మెడకు ఉరిబిగించి జాకీర్ను చంపేసినట్లు పోలీసు వర్గాలు తెలిపారు . మృతదేహాన్ని టాటా మేజిక్ వాహనంలో తరలించి ఏలూరు వద్ద పడేశారని నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.




Total views : 202980