ఓ పక్క ఎన్నికలు, మరో పక్క సమ్మర్ హాలిడేస్… ఇంకేముంది ట్రావెల్ ఏజెన్సీ వాళ్లు అమాంతంగా చార్జీలు పెంచేశారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. దీనితో విమాన చార్జీల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు డిమాండ్ ఎక్కువగా ఉంది. బస్సు చార్జీలు కూడా విమాన చార్జీలకు పోటీ పడటంతో విమాన సర్వీసుల టికెట్ ధరలు 20 నుంచి 30 శాతం పెరిగాయి. దండుకునేందుకు భారీగా ధరలు పెంచాయి. దీనితో విమాన చార్జీలు చుక్కలను అంటుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి సాధారణంగా రోజుకు సగటున 50వేల మంది విమానాల్లో ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం వారి సంఖ్య దాదాపు 60 వేలకు పెరిగింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇంకేముంది. దండుకునేందుకు విమానయాన సంస్థలు భారీగా ధరలు పెంచాయి. కొద్దిరోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలతో కొడైకెనాల్, కొచ్చి, ఊటీ, కేరళ, జైపుర్, ఢిల్లీ, అయోధ్య, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, మలేసియా తదితర ప్రాంతాలకు రద్దీ పెరిగింది. ఎన్నికల దృష్ట్యా ఢిల్లీతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు నేతల రాకపోకలు పెరిగాయి. ఫలితంగా పలు ఎయిర్లైన్స్ సంస్థలు ఛార్జీలు పెంచాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి సాధారణ రోజుల్లో సగటున టికెట్ ధర 4వేల 500 రూపాయలు ఉంటుంది. ఎన్నికలకు ముందు రోజు 12వ తేదీకి దాదాపు 50 శాతం పెరిగి 6వేల 500 రూపాయలకు చేరింది. అదే రోజున ఢిల్లీకి 6వేలుగా ఉంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి కొచ్చికి 5 వేల వరకు ఛార్జీ ఉంటుంది. ఈ నెల 12న 7 వేల రూపాయల వరకూ ఉంది. ఆఖరి నిమిషంలో రద్దీని బట్టి ఛార్జీల్లో మార్పులు ఉంటాయని ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరికుప్పం పట్టణంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు . కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు…
- రాజధాని అమరావతి పునర్నిర్మాణం పై సీఎం స్పెషల్ ఫోకస్ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టిపెట్టింది. సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం, ఎన్డీయే ప్రభుత్వం తాజా బడ్జెట్లో అమరావతి అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో లాండ్ పూలింగ్ మళ్లీ ప్రారంభమైంది.…
- నర్సులే.. డాక్టర్లు అయ్యారుభారతీయుడు-2 సినిమాలో మాదిరి ఫోన్ లో వీడియోలు చూసుకుంటూ నర్సులే వైద్యం చేస్తున్నారు. వైద్యులు లేకపోవడంతో బుచ్చిరెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనర్సులే.. డాక్టర్లు అయ్యారు . ఫోన్ లో చూసుకుంటూ వైద్యం చేస్తున్నారు. వారం రోజుల్లో ఒక్కసారి కూడా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.