ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు ఓటర్లు తరలివెళ్తున్నారు. హైదరాబాద్(Hyderabad) నుంచి సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో, హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే రోడ్లన్నీ ఫుల్గా కనిపిస్తున్నాయి. సోమవారం ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో, అక్కడ ఓటు హక్కు ఉన్న వాళ్లందరూ స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు. ఇంకా వెళ్తూనే ఉన్నారు. ఓటు వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఫలితంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే హైవేపై వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి.
పోలింగ్ తేదీకి ముందు వరుస సెలవులు రావడం కలిసొచ్చింది. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో ఓటు వేసేందుకు స్వస్థలాలకు వెళ్తున్నవాళ్లు.. కుటుంబసభ్యులతో సహా తరలివెళ్తున్నారు. శనివారం సెకండ్ సాటర్ డే, ఆదివారం, సోమవారం పోలింగ్ సెలవు వచ్చాయి. దీంతో, శుక్రవారం రాత్రి నుంచే రోడ్లమీద రద్దీ పెరిగింది.
కొందరు అభ్యర్థులు హైదరాబాద్లో స్థిరపడ్డ ఏపీ ఓటర్లను రప్పించేందుకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. ఇక, సొంత వాహనాలు ఉన్నవాళ్లు.. తమ వాహనాల్లోనే కుటుంబసమేతంగా స్వస్థలాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా రోడ్లమీద వాహనాల రద్దీ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లడానికి అవకాశం ఉన్న అన్ని రోడ్లమీద ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా వాహనాలు హైవేలపై నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.
ఇక, హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య ఉన్న టోల్ ప్లాజాలు కిక్కిరిసిపోతున్నాయి. శుక్రవారం రాత్రినుంచే టోల్ప్లాజాలన్నీ రద్దీగా మారాయి. టోల్ప్లాజాలు దాటేందుకు చాలా సమయం పడుతోంది. ప్రధానంగా చౌటుప్పల్, పంతంగి, చిల్లకల్లు, కీసర టోల్ప్లాజాల దగ్గర వాహనాల రద్దీ పెరిగిపోయింది. దీంతో, వాహనాల రద్దీకి అనుగుణంగా ఆయా టోల్ప్లాజాల్లో కౌంటర్లను కూడా పెంచేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- జగన్ ను భయపెడుతున్న రెడ్ బుక్ రహస్యాలుతాను ఇంకా రెడ్బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి మరీ ఆయన రెడ్బుక్కు ప్రచారం కల్పిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ లాబీలో లోకేశ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో…
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరికుప్పం పట్టణంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు . కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు…
- రాజధాని అమరావతి పునర్నిర్మాణం పై సీఎం స్పెషల్ ఫోకస్ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టిపెట్టింది. సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం, ఎన్డీయే ప్రభుత్వం తాజా బడ్జెట్లో అమరావతి అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో లాండ్ పూలింగ్ మళ్లీ ప్రారంభమైంది.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.