Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home National చైనా ప్రవర్తనపై మండిపడ్డ జైశంకర్

చైనా ప్రవర్తనపై మండిపడ్డ జైశంకర్

by Satya
Jaishankar


Jaishankar:

ఉగ్రవాదాన్ని తేలికగా తీసుకునే స్థితిలో భారత్(India) లేదని అన్నారు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్. సింగపూర్(Singapore) పర్యటనలో భాగంగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్(National University of Singapore) కు చెందిన ఓ ఇనిస్టిట్యూట్(Institute) లో ప్రసంగించారు. పాక్, చైనాల చర్యలను ఖండించారు. పాక్ ఉగ్రవాద పరిశ్రమలా పని చేస్తోందని మండిపడ్డారు. అయితే భారత్ ఉగ్రవాదాన్ని చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. సమస్యలకు పరిష్కారాలు వెతకాలని సూచించారు. సమస్య నుంచి తప్పించుకోవడం వల్ల తిరిగి ఇబ్బందులే ఎదురవుతాయని అన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ప్రతి దేశం పొరుగు దేశంతో సత్సంబంధాలు కోరుకుంటుందన్నారు. పాక్ తో సంబంధాల కోసం ఉగ్రవాదాన్ని అయితే చూసీచూడనట్టు వదిలేయం అని క్లియర్ గా చెప్పారు జైశంకర్. మరోవైపు చైనా ప్రవర్తనపైనా జైశంకర్ మండిపడ్డారు. సేలా సొరంగ మార్గాన్ని మోడీ ఇటీవలే ప్రారంభించారు. అయితే అది తమ భూభాగమని.. సరిహద్దు వివాదం భారత్ వల్లే ముదురుతుందన్న చైనా మాటలను కొట్టిపారేశారు జైశంకర్. చైనా వ్యాఖ్యలు ఓ జోక్ అని.. అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగం అని నొక్కి చెప్పారు.

ఇది చదవండి: దేశానికి తాగునీటి గండం..


మరోసారి CNG ధర పెంచిన కేంద్రం..
వాహనదారులపై ఇంధన భారం మరింత పెరిగింది. CNG ధరలను కేంద్రం మరోసారి పెంచింది. కిలోకు రూపాయి …
మిస్టర్ మోదీ… దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది..
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి …
తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు..
తమిళనాడు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌. తమిళ ప్రజలు మార్పు కోరుకున్నారని..అందుకే విజయ్‌ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014341
Total views : 79960

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.