బతుకమ్మా చీరల యార్న్ సబ్సిడీ నుంచి గత ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా ఇవ్వాలంటూ కార్మికులు ధర్నా చేశారు. తంగళ్ళపల్లి మండలం బద్దనపల్లిలో టెక్స్ టైల్ పార్క్ గేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన కార్మికులు కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదంటూ నినదించారు.గత ప్రభుత్వం యారన్ సబ్సిడీ ఒక మీటరుకు 1 – 42 పైసలు ఇవ్వగా, ఈ ప్రభుత్వం కేవలం 30 పైసలకు తగ్గించడం దుర్మార్గం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నా కార్యక్రమానికి సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ గారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ . . . ప్రభుత్వం కార్మికులకు అన్ని విధాల మేలు చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు నష్టం చేసే విధానాలను అవలంబించడం దుర్మార్గమని, కార్మికులకు మేలు చేయడమే ఈ ప్రభుత్వ ఉద్దేశం అయితే తగ్గించిన యారన్ సబ్సిడీని గతంలో ఇచ్చిన మాదిరిగా ఒక మీటరు 1 – 42 పైసలు కార్మికులందరికీ వెంటనే అందించాలని మరియు ఇతర సంక్షేమ పథకాలను కూడా యధావిధిగా కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బతుకమ్మా చీరల యార్న్ సబ్సిడీ ఇవ్వాలంటూ కార్మికులు ధర్నా రెండు, మూడు రోజుల్లోపు సమస్య పరిష్కారం కాకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని, అవసరమైతే టెక్స్ టైల్ పార్కులో విధులను కూడా బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టెక్స్ టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కూచన శంకర్ , అక్కల శ్రీనివాస్ , జెల్ల సదానందం , సుంకటి మహేష్ , దూస రాజమల్లు , మేఘ ఆంజనేయులు , దూడం సంపత్ , రాజశేఖర్ , రమేష్ , శ్రీకాంత్ , శ్రీనివాస్ , వెంకటేష్ , భాస్కర్ , రాజశేఖర్ , కుమార్ , నరేష్ , అంబదాస్ , రంగయ్య , వేణు , అశోక్ , రాజేష్ , కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్లో వీఎన్ ఆదిత్య..శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం…
- ఐపీఎల్ 2026 ఫైనల్కు రంగం సిద్ధం..ఐపీఎల్ 2026 సీజన్కు నేడు గ్రాండ్ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మరోవైపు వ్యూహాత్మక ఆటతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్.. టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక నరేంద్ర మోదీ…
- కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ దొంగలు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. కృష్ణా జిల్లా బందరు రూరల్…
- హైదరాబాద్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ భేటీలో…
- దాసరి నారాయణరావు గారు ఓ ఇన్స్టిట్యూషన్.. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి..దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ను హీరో రాకింగ్ మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో దాసరి ఘాట్ దుస్థితిపై యాంకర్ గౌతమి షేర్ చేసిన వీడియోపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 90068