దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షాల రాకతో ఒకవైపు వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుండగా, మరోవైపు అనేక రోగాల బారిన పడే ప్రమాదం కూడా పెరిగింది. ఈ క్రమంలో మరోసారి జికా వైరస్ కలకలం .. రేపింది. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో ఈ వైరస్ సోకిన రెండు కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ప్రారంభంలో ముంబైలో కొన్ని కేసులు నమోదయ్యాయి. ఇది దోమల ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని వేగంగా పెంచుతుంది. జికా వైరస్ కోరలు చాచుతోంది. మహారాష్ట్రలోని పుణెలో రెండు కేసులు నమోదు అయ్యాయి. ఓ వైద్యుడు, ఆయన కుమార్తెకు జికా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని పుణె కార్పొరేషన్ అధికారులు తెలిపారు. నగరంలోని ఎరండ్ వానే ప్రాంతానికి చెందిన ఓ వైద్యుడికి జ్వరంతోపాటు శరీరంపై దద్దుర్లు వచ్చాయి.
దీంతో ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన రక్తనమూనాలను నగరంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. జూన్ 21న ఆయనకు జికా వైరస్ పాజిటివ్ గా వచ్చినట్లు నిర్ధారించారు అధికారులు. తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేశారు. వైద్యుడి కుమార్తెకు కూడా వైరస్ సోకినట్లు పేర్కొన్నారు. రెండు కేసులు నమోదు అవ్వడంతో అప్రమత్తమైన వైద్య అధికారులు ఆ ప్రాంతంలో వైరస్ వ్యాప్తి నివారణ చర్యలను చేపట్టారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.