విజయవాడ(Vijayawada)లో నిర్వహించిన ప్రజాగళం రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. వేలాదిగా మూడు పార్టీల శ్రేణులు తరలివచ్చి జయప్రదం చేసిన ఈ రోడ్ షో మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమై బెంజి సర్కిల్ వద్ద ముగిసింది. బెంజి సర్కిల్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న రైతులు, మహిళలకు ప్రధాని మోదీ అభివాదం చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కాగా, ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ పాల్గొన్న రోడ్ షోకు విశేష స్పందన లభించింది. అంచనాలకు మించి సక్సెస్ అయ్యిందన్న ఆనందం కూటమి నేతల్లో వెల్లివిరిసింది. ఈ రోడ్ షోతో ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం ముగిసినట్టయింది. రాష్ట్రంలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఒకే రోజున లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
- జగన్ ను భయపెడుతున్న రెడ్ బుక్ రహస్యాలుతాను ఇంకా రెడ్బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి మరీ ఆయన రెడ్బుక్కు ప్రచారం కల్పిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ లాబీలో లోకేశ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో…
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరికుప్పం పట్టణంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు . కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు…
- రాజధాని అమరావతి పునర్నిర్మాణం పై సీఎం స్పెషల్ ఫోకస్ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టిపెట్టింది. సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం, ఎన్డీయే ప్రభుత్వం తాజా బడ్జెట్లో అమరావతి అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో లాండ్ పూలింగ్ మళ్లీ ప్రారంభమైంది.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.