35 ఏళ్ల క్రితం అక్కడంతా తుమ్మ పొదలు చెత్త చెదరాలు అక్కడికి వెళ్లాలంటే అంత చిత్తడిగా ఉండేది. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఆ స్థలం పట్టణంలోని నడిబొడ్డున ఉంది. అయినప్పటికీ అప్పుడున్న బతుకులు మాత్రం అలాగే ఉన్నాయి కానీ ఆ ఏరియా మాత్రం లక్షల నుంచి కోట్ల వరకు చేరింది. దీంతో మొన్నటిదాకా నిశ్శబ్దంగా ఉన్న కొందరు కబ్జాదారులు ఈ కాస్ట్లీ స్థలంపై కన్ను పడింది.ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటున్న నిరుపేదలు… ఇంకేముందీ నిరుపేదల కడుపు కొట్టాలని చూస్తున్నారు. పొట్ట చేత పట్టుకుని కూలీ చేసుకుంటూ బతుకుతున్న తమకు ఇల్లు పట్టాలు ఇవ్వాలంటూ తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని కొందరు నిరుపేదలు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని మార్కండేయ కాలనీ సమీపంలో ఫైర్ స్టేషన్ పక్కనే ఉన్న ఏరియా ఇప్పుడున్న పరిస్థితులలో చదరపు గజానికి లక్షల్లో ధర పలుకుతుంది. దీంతో కబ్జాదారుల కన్ను దీనిపై పడింది. మీకు సహాయం చేస్తామంటూనే కొందరు రాజకీయ నాయకులు నిరుపేదల కడుపు కొట్టె ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిరుపేదలకు భరోసా కల్పిస్తుంటున్నారు. పొట్ట చేత పట్టుకుని 35 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి కూలీ నాలీ చేసుకుంటూ చిన్నచిన్న ఇల్లు కట్టుకున్న 25 కుటుంబాలు ప్రజలు ఉంటున్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటున్న నిరుపేదలు…అయితే తమకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులను ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు. పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పట్టాలు ఇవ్వాల్సింది పోను నానా రకాలుగా నాయకులు ఇబ్బందులు పెడుతున్నారని అంటున్నారు.కూలీ పనులు చేసుకునే నిరుపేదల కడుపులను కొట్టవద్దని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి మూర్తి అంటున్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో వారికి త్వరలో ఇల్లు కట్టించి కనీస సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.