పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో విలీనం చేస్తామంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) స్పందించారు. పాకిస్థాన్ గాజులు తొడుక్కొని లేదని, ఆ దేశం వద్ద అణు బాంబులు ఉన్నాయని, పాక్ ప్రతీకార దాడిలో సరిహద్దు అవతల నుంచి మన మీద బాంబులు పడతాయని అబ్దుల్లా కౌంటర్ ఇచ్చారు. దురదృష్టవశాత్తూ మన మీద అణుబాంబులు పడితే ఏంటి పరిస్థితి అని అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
పీవోకేని భారత్ బలవంతంగా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదని అబ్దుల్లా అన్నారు. భారత్లో భాగం కావాలని పీవోకే ప్రజలు కోరుకుంటున్నారంటూ రాజ్నాథ్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు ఫరూక్ అబ్దుల్లా ఈ కౌంటర్ ఇచ్చారు. కాగా కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి భారత్లో భాగం కావాలని పీవోకే ప్రజలు కోరుకుంటున్నారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రజలు తమంతట తాము భారత్లో భాగం కావాలనుకుంటున్నారని, పీఓకేను బలవంతంగా భారత్లో కలపాల్సిన అవసరం లేదని అన్నారు.
- నీతి ఆయోగ్ సమావేశంపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలునీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని ఇండియా కూటమి నేతల నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సమర్థించారు. అది వారి హక్కు అని స్పష్టం చేశారు. ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు, డీఎంకే సీఎం స్టాలిన్ నీతి ఆయోగ్ భేటీని బహిష్కరించారని…
- ముంబైకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిందివిద్యాసంస్థలు ఈరోజు పాఠశాలలకు సెలవును ప్రకటించాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. పరిస్థితిని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు సమీక్షించారు. ఈరోజు మధ్య మహారాష్ట్రలోని కొంకణ్లో అత్యంత భారీ…
- కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించిన ప్రధాని25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లడఖ్ లోని ద్రాస్ సెక్టార్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించిన ప్రధాని. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ నాడు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.