కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నియోజకవర్గ వ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా రైతులు గగ్గోలు పెడుతున్నారు. పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో ఏలేస్వరం ప్రత్తిపాడు మండలాలో భారీ వర్ష పాతం నమోదు అయ్యింది. భారీ వర్షం కారణంగా నాలుగు మండలాలలో వరి, అరటి పలు వాణిజ్య పంటలు సుమారుగా వందలాది ఎకరాల్లో నష్టపోయినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు కారణంగా వరి చేలు పూర్తిగా నీటమునిగాయని, ఈదురు గాలులకు అరటి తోటలు నేలకొరిగాయని పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిలిందని కన్నీరు పర్యతమయ్యారు. ప్రభుత్వ వెంటనే స్పందించి పంట నష్టం అంచనా వేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.
banana trees
కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామ పంట పొలాలలో విచిత్రంగా ఉన్న అడుగులను చూసి స్థానిక రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
అరటి తోటలో అరటి చెట్ల పైకి గోర్లతో పాకిన వైరాన్ని గుర్తించిన రైతులు స్థానిక అటవీ శాఖ అధికారులకు తెలుపగా అటవీ శాఖ అధికారులు సంబంధిత ప్రాంతానికి వచ్చి పర్యవేక్షించారు. అడుగులను, సంచరించిన ప్రదేశాన్ని, ధ్వంసం చేసిన అరటి చెట్లను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం అరటి తోటలో వరుసగా ఏడు ఎనిమిది చెట్లను ధ్వంసం చేసి వున్నాయని, దాన్ని అడుగులు పరిశీలిస్తే పెద్దవిగా ఉన్నాయని ఏదో అడవి జంతువేమో అని భయముగా ఉందని తెలిపారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని తక్షణమే వారు స్పందించి ఈ ప్రదేశాన్ని పరిశీలించారని అన్నారు. ఇది ఏ జాతికి చెందిదో గుర్తించి మా రైతులకు భయం లేకుండా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు.





Total views : 61830